ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్న జగపతిబాబు తర్వాత ఇండస్ట్రీకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లోను ఫుల్ బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తున్నాడు జగపతిబాబు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిసిగా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తను మోసపోయానని.. రియల్ ఎస్టేట్ రంగాల్లో జరుగుతున్న మోసాల పై జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన వివరించాడు.
దానికి నేను బాధితుడినయాను అని వాపోయిన జగపతిబాబు.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను షేర్ చేసుకున్నాడు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసింది. ఇక జగపతి బాబు మాట్లాడుతూ ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ యాడ్లో నేను యాక్ట్ చేశా.. అయితే నన్ను వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు ఎవరు.. అసలు ఏం జరిగింది.. అనే వివరాలు త్వరలోనే చెప్తా. భూమి కొనే ముందు కాస్త రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ రూల్స్ తెలుసుకోండి అంటూ జగపతిబాబు వివరించాడు.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న జగపతిబాబు పాన్ ఇండియన్ మూవీ పుష్ప2, మిస్టర్ బచ్చన్ సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక జగపతిబాబు కామెంట్స్ వైరల్ గా మారడంతో.. స్టార్ స్టేటస్ ఉన్న జగపతిబాబు లాంటి వారే రియల్ ఎస్టేట్ ఊబిలో మోసపోయారంటే.. సాధారణ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ.. వీటిపై తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.