వాట్.. ఫోన్ ట్యాపింగ్ వల్లే నాగచైతన్య, సమంత విడిపోయారా.. షాకింగ్ విషయాలను రివిల్ చేసిన తీన్మార్ మల్లయ్య..

టాలీవుడ్ జంట నాగచైతన్య, సమంత రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటో తెలియ రాలేదు. ఎవరికి వారు తమకి నచ్చినట్లు వాళ్ళు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలను వివరిస్తూ వచ్చారు. కాగా సమంత బోల్డ్ గా కనిపించడం, గ్లామర్ డోస్‌ పెంచడమే వీళ్ళు విడాకులకు కారణం అంటూ వార్తలు వినిపించాయి.

సమంత వ్యవహరించే తీరు అతని ఫ్యామిలీకి నచ్చలేదని.. పిల్లల విషయంలో చైతు, సమంత మధ్యలో గొడవలు జరిగాయని, అక్కినేని వ్యాపారాల్లో ఈమె జోక్యం చేసుకోవడం కూడా ఆ ఫ్యామిలీకి నచ్చలేదంటూ.. వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అసలు విషయం ఏంటనేది ఆ జంట‌కే తెలియాలి. అయితే ఇప్పుడు శ్యామ్ చైతు విడిపోవడానికి కారణం అదే అంటూ మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది. తీన్మార్ మల్లన్న ఈ విషయాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు, జ‌డ్జీల‌ ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేస్తున్నారు. ఇందులో అప్పటి అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని.. వారి అండదండలతోనే పోలీసులు.. అధికారులు.. ఫోన్ టాపింగ్స్ చేశారనే.. విషయం డిఎస్పీ విచారణలో వెళ్లడయింది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ వల్లే టాలీవుడ్ లో ప్రముఖ హీరో, హీరోయిన్ విడిపోయారు. మూడు తరాల సినిమాల్లో రాణిస్తున్న ఫ్యామిలీకి చెందిన హీరో, స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న నటి ఈ ఫోన్ టాపింగ్ కారణంగానే విడాకులు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆరోపణలు వైరల్ గా మారాయి.

తీన్మార్ మల్లన్న మాత్రం ఆ ఇద్దరు నాగచైతన్య, సమంతనే అని తెలుసేట్లుగా చెప్పారు. ఈ విషయంపై పూర్తిగా సమాచారం సేకరించి వీడియో చేస్తానని యూట్యూబ్ వీడియోలో వెల్లడించాడు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నాడు. నటి ఫోన్ ట్యాప్ చేశారని.. ఆమెతో భేరసారాలు చేసి అది వర్కౌట్ కాకపోవడంతో.. హీరో ఫ్యామిలీకి ఆ వీడియో ఇచ్చేసారని ఆయన చెప్పుకొచ్చాడు. సమంత, చైతు విడిపోవడానికి ఓ పెద్ద పొలిటికల్ లీడర్.. మందుల వ్యాపారం చేసే పొలిటిషన్ హ‌స్తం ఉందంటూ తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.