ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కత్రినా కైఫ్ దూసుకుపోతుంద. తన అందం అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాధించుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఇండియన్ సినీ ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొంత కాలం క్రితమే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన “టైగర్ 3” సినిమాలో హీరోయిన్ గా నటించి మెపించింది. భారీ బడ్జెట్తో మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించిన స్థాయిలో సక్సస్ అందుకోలేకపోయింది. అయినా ఈ మూవీలో కత్రీనా మాత్రం తన నటనతో, అంద చందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ఇకపోతే ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ను తెలుగు మూవీల నుంయే మొదలు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కత్రీనా.. విక్టరీవెంకటేష్ హీరోగా బచ్చిన మల్లీశ్వరి సినిమాలో, నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన అల్లరి పిడుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాలు కత్రానాకి టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక తాజాగా ఈ అమ్మడు తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న అవమానాలను, సమస్యలను అడియన్స్ తో షేర్ చేసుకుంది.. నేను నటిగా కెరీర్ను ప్రారంభించిన మొదట్లో చాలా అవమానాలను ఫేస్ చేశా.
నువ్వు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేవు అని చాలా మంది నన్ను హేళన చేశారు. మల్లీశ్వరి మూవీ షూటింగ్ టైంలో అయితే ఓ సాంగ్ షూట్ జరుగుతుంటే ఎవరో మైక్ లో ఈమెకు డ్యాన్స్ రాదు.. డ్యాన్స్ చేయడం ఈమె వల్ల కాదు అని అవమానించారు. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఇలాంటి ఎన్నో అవమానాలను నేను కెరీర్ స్టార్టింగ్లో ఎదుర్కొన్నా అంటూ కత్రినా తాజా ఇంటర్వ్యూ లో వివరించింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావటంతో అంతా షాక్ అవుతున్నారు. ఆమెకు మలీశ్వరీ టైంలో ఇంత ఘోరమైన అవమానం జరిగిందా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.