టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ నదియాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్లో వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తెలుగులో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు మంచి పాపులారిటీతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా మెప్పించింది. తను నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నదియా.. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో పవన్ అత్త పాత్రలో నటించి మెప్పించింది.
ఈ సినిమాలో ఉత్తమ సహాయ నటిగా ఆమెకు నంది అవార్డు కూడా దక్కింది. ఇక అత్తారింటికి దారేది తర్వాత వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతున్న నదియా.. మిస్ ఇండియా, దృశ్యం 2, ది వారియర్ లో నటించింది. పెళ్ళికి ముందు వరుస సినిమాలు చేసిన ఈమె.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం నదియా ఫ్యామిలీ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
నదియా కూతుళ్లు ఈ ఫోటోలో ఆమెను మించి అందంతో ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వీరి ముందు దిగదుడిపే అనంత రేంజ్లో వీరు ఆకట్టుకుంటున్నారు. నదియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఇప్పటికీ తరగని అందంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అదే విధంగా ఆమె కూతురు కూడా అంతే అందంగా వీక్షకుల మతి పోగోడుతున్నారు. చూడడానికి ఈ ముగ్గురు అక్క చెల్లెల అనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.