టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కిన అందమైన లవ్ స్టోరీలో జయం ఒకటి. ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకొని బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 2002 జూన్ 14 నా రిలీజ్ అయిన ఈ సినిమాతో హీరోయిన్ సదాకు భారీ పాపులారిటీ వచ్చింది. అలాగే ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేసిన గోపీచంద్ నటనకు ఎంతో మంది ప్రశంసలు అందాయి. ఇక ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.
అయితే తేజ నటించిన ఈ సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించిన వారితో పాటు సదా చెల్లెలిగా నటించిన అమ్మాయి కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేక్షకులలో ఆకట్టుకున్న ఈ అమ్మాయి మూవీలో అక్షరాలను రివర్స్ చేసి రాస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈమె నటించింది కేవలం ఒక్క సినిమానే అయినా.. ఈ సినిమాతో ఏకంగా నంది అవార్డును అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడెలా ఉందో చూడాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఈ చిన్నదాన్ని లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తన పేరు యామిని శ్వేత. చైల్డ్ ఆర్టిస్ట్ గా జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తలదన్నే అందంతో.. హాట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే జయం తర్వాత యామిని ఏ సినిమాలోను నటించలేదు. పలు యాడ్స్ లో నటించిన తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి.. వివాహం చేసుకుని.. ఫ్యామిలి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అన్నట్లు ఈమెకు ఓ బేబీ కూడా ఉంది.