టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగచైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుఉమ్మ. తర్వాత వచ్చిన రంగం మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక.. పలు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఇటీవల తన ప్రియుడు రోహిత్ మీనన్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కేరళలోని త్రివేండ్రంలో గ్రాండ్గా వీరి పెళ్లి జరిగింది. ఇక వీరిద్దరి పెళ్లి ఫొటోస్ నేను మొన్నటి వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే రాధ కూతురు కార్తీక పెళ్లిలో వేసుకున్న నగలను చూసి రాధ తన సినీ కెరీర్ లో ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించిందో అంటూ అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. ఇక తాజాగా రంగం బ్యూటీ తన పెళ్లి కోసం భర్తకు ఎన్ని కోట్లు కట్టినమిచ్చిందో అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రాధా తన కూతురు పెళ్లికి అల్లుడికి భారీగానే కట్నం ఇచ్చిందట. రూ.8 కోట్ల విలువ చేసే ఖరీదైన కారుతో పాటు రూ.30 కోట్ల విలువ చేసే బంగారాన్ని కట్నంగా ఇచ్చిందట. ఇక ఇవి మాత్రమే కాకుండా దుబాయ్ లో ఉండే తన రెస్టారెంట్ని కూడా కూతురు పేరు మీద రాసి ఇచ్చేసినట్లు తెలుస్తుంది. ఇలా రాధ తన కూతురికి భారీగానే కట్న కానుకలను సర్దినట్లు సమాచారం.