డ్రగ్స్ కేసు పై మరొకసారి క్లారిటీ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ అమ్మడు మొదట హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోవడంతో ఆ తర్వాత నెగిటివ్ షెడ్ ఉన్న పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఇప్పటికీ అలాంటి పాత్రలోనే నటిస్తూ మంచి క్రేజ్ అందుకుంది. గత కొద్ది రోజులుగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పేరు డ్రగ్స్ కేసులో వినిపిస్తూనే ఉంది. మరొకసారి తాజాగా ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆగస్టు 18 వ తేదీన కేరళలో వినియం బీచ్ లో NIA అధికారుల సైతం భారీ మొత్తంలో శ్రీ విజ్ఞేశ్ అనే ఫిషింగ్ బోట్ నుంచి డ్రగ్స్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.అలాగే ఒక AK -47 రైఫిల్స్ 17 రౌండ్లు బుల్లెట్లు 5 9MM పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ పైన ఆయన అసిస్టెంట్ అదిలింగం పైన పలు రకాల వార్తలు వినిపించాయి. దీంతో ఆది లింగమును విచారణ చేపట్టాలని అధికారులు సైతం కోరడం జరిగింది.

కొచ్చి కార్యాలయంలో వరలక్ష్మి శరత్ కుమార్ని సైతం అధికారులు విచారించారు.. ఆదిలింగాతో తనకున్న అనుబంధం పైన స్టేట్మెంట్ నమోదు చేసుకొని డ్రగ్స్ ద్వారా సంపాదించిన సొమ్మును ఆదిలింగం సినిమాలలో పెట్టుబడి పెట్టినట్లుగా అధికారులు సైతం గుర్తించారట ..అయితే ఈ విషయం అయితే వరలక్ష్మి శరత్ కుమార్ ను కూడా NIA అధికారులు ప్రశ్నించినట్లుగా వార్తలు వినిపించాయి.. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఎన్నోసార్లు మీడియాకు తెలిపాను ..ఇప్పుడు మరొకసారి తెలుపుతున్నాను తనమీద వస్తున్న ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నాను అంటూ తెలిపింది. తన మాజీ మేనేజర్ ఆదిలింగం ఈ కేసులో ఉండడం వల్ల తన పేరు వినిపించిందని తెలుపుతోంది. తనకు ఎలాంటి విచారణకు నోటీసులు పంపలేదని కూడా తెలియజేసింది. డ్రగ్స్ విషయంలో తనకు సంబంధం లేదని కూడా తెలిపింది.