శివాజీ – యావర్ మధ్య వార్.. వాడు దానికి ఫేవర్ చేయాలని చూస్తున్నాడు.. అమర్ టంగ్ స్లిప్..

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు సక్సెస్ఫుల్గా ముగించుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఐదో వారంలో నామినేషన్స్ లో తేజ, ప్రియాంక, అమర్ దీప్, యావర్, గౌతమ్ కృష్ణ, శివాజీ ఉన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తరువాత పవర్ అస్త్ర టాస్క్ ప్రారంభమైంది. హౌస్ మేట్స్ అయ్యేందుకు కంటిస్టేన్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది‌. నిన్నటి కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకులుగా యావర్, శోభ శెట్టి ను నిర్మించాడు బిగ్ బాస్. అంతేకాకుండా టాస్క్ ఆడుతూనే సంచాలకుగా ఉండాలని వారికి ఆదేశించడంతో.. యావర్ తడబడ్డాడు. అసలు టాస్క్ లో ఎవరికీ న్యాయం చేయాలి, ఎవరు ఏం ఆడారో తెలియని అయోమయంలో మూడు, నాలుగు సార్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చాడు.

దీంతో హౌస్ లో గందరగోళం నేలకుంది. ప్రియాంక, శోభ, అమర్దీప్, సందీప్, శివాజీ, ప్రశాంత్, యావర్, తేజ, శుభశ్రీ, గౌతమ్ ఇలా ఐదు జంటలుగా విడిపోయి కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడ్డారు. అయితే ఇందులో అందరికంటే ముందు ఈ టాస్క్ లో గంట కొట్టింది పల్లవి ప్రశాంత్, శివాజీ. తర్వాత అమర్, సందీప్ టాస్క్ కంప్లీట్ చేయకుండానే గంట మోగించి.. టాస్క్ పూర్తయిన తర్వాత మళ్లీ గంట మోగించారు. ఇలా టాస్కులు పూర్తయిన తర్వాత ఎవరు సరిగ్గా ఆడక పోవడంతో విజేతలను ప్రకటించడంలో యావర్, శోభలకీ పెద్ద రిస్క్ అయింది.

మొదటి శివాజీ, ప్రశాంత్ ల‌కు ఫస్ట్ ప్లేస్ ఇచ్చి.. సెకండ్ ప్లేస్ అమర్దీప్, సందీప్ లకు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరిని మార్చేసి సుబ్బు, గౌతమ్ కు మొదటి స్థానం ఇచ్చాడు. దీంతో హౌస్ లో రచ్చ పెరిగిపోయింది. ఈ నిర్ణయంతో ఎంతో సహనంగా ఉండే శివాజీ, యావర్ మధ్య మాటలు యుద్ధం జరిగింది. అంతేకాకుండా హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యావర్ను తిట్టి పోశారు. ఇక అమర్ అయితే ..” ఆ యావర్ గాడు.. దానికి (సుబ్బు) ఫేవర్ చేయాలని మొత్తం గేమ్ మార్చేశాడు.. ఇదిరా.. ఫేవరిజం అంటే ” అంటూ నోరు జారాడు.