గుంటూరు కారం పై క్రేజీ అప్డేట్ అందించిన డీజె టిల్లు.. ఏం చెప్పాడంటే..?

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తాజాగా డీజే టిల్లు సీక్వెల్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీప్ గెస్ట్ గా వచ్చాడు సిద్దు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ ” కొద్దిసేపటి క్రితమే చిన్న బాబు గారు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇవాళ గుంటూరు కారం మూవీలో ఒక సూపర్ సాంగ్ ని తెరకెక్కించారు. ఇటీవల కాలంలో ఇటువంటి సాంగ్ ని నేను చూడలేదు.

తప్పకుండా రేపు రిలీజ్ తరువాత ఈ సాంగ్ కి థియేటర్స్ తగలబడడం ఖాయం అని అన్నారని ” చెప్పుకొచ్చాడు. నిజానికి చిన బాబు గారు ఎక్కువగా మాట్లాడరని.. అలాంటి ఆయన ఈరోజు ఇలా చెప్పారు అంటే ఇక మీరే ఊహించుకోవచ్చు అని అన్నారు సిద్దు. మొత్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.

ఓవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ స్టోరీ, స్క్రిప్ట్, టేకింగ్ ని అదరగొడుతుంటే మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సాంగ్స్, బీజీఎమ్ ని అత్యద్భుతంగా సిద్ధం చేస్తున్నారు. తప్పకుండా రానున్న సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న గుంటూరు కారం ఆడియన్స్ కి ,ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ అందించడం ఖాయమని తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నిర్మాత నాగ వంశీ వెల్లడించాడు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, సునీల్, ఆలీ, హైపర్ ఆది కీలక పాత్రల్లో కనిపించనున్నారు.