బిగ్‌బాస్ సీజన్ 6 లోనే పల్లవి ప్రశాంత్ ఉన్నాడని తెలుసా..?

బిగ్‌బాస్ సీజన్ 7 ప్రచారం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకుని ఐదవ వారంలో అడుగుపెట్టారు. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్ బాస్ 7 ప్రస్తుతం 10 మంది హౌస్‌లో ఉన్నారు. ఇక ఈ షో కి కంటిస్టెంట్ గా రైతుబిడ్డ వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లో పల్లవి ప్రశాంత్ హౌస్‌మేట్‌ల‌ నుంచి కాస్త నెగిటివిటీ ఎదుర్కొన్నాడు.

 

రైతు బిడ్డ అంటూ హేళనగా మాట్లాడినా.. వారిని ఏమీ అనకుండా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే రైతు బిడ్డ ఎప్పటినుంచో కలలు కనడట బిగ్‌బాస్ కి రావాలని. ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి రావాలని కోరిక ఉంది అంటూ తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశాడు. పల్లవి ప్రశాంత్ ఆవేదనకు బిగ్ బాస్ కరిగి.. సీజన్ సెవెన్ లో పాల్గొనే అవకాశం ఇచ్చింది. అయితే ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభంలో కూడా సందడి చేశారనే విషయం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరి ప్రశాంత్ కంటెస్టెంట్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నార అనే విషయానికి వస్తే ప్రశాంత్ కంటిస్టెంట్గా ఈ సీజన్లో పాల్గొన‌లేదు. కానీ వీకెండ్ నాగార్జున వేదిక పైకి వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా కొందరు ఆడియన్స్ బిగ్ బాస్ సెట్ లో సందడి చేస్తూ ఉంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా బిగ్ బాస్ 6 సమయంలో ఒక ఆడియన్ గా ఆ సెట్ లో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Arey Thai (@areythai)