`బృందావనం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బృందావనం` ఒకటి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లు నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. శ్రీహరి, ప్రకాష్ రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న బృందావనం.. 2010లో విడుదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంమిటంటే బృందావనం మూవీకి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు. ఎన్టీఆర్ కంటా ముందే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వద్దకు బృందావనం కథ‌ వెళ్ళింది. కానీ ఆయన నో చెప్పారు. ఇంతకీ ఆ అన్ ల‌క్కీ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

వంశి పైడిపల్లి, మహేష్ బాబు మంచి మంచి స‌న్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే బృందావనం కథను మహేష్ తో చేయాలని అనుకుని క‌థ వినిపించారు. అయితే ఆ టైమ్ లో త్రివిక్రమ్ తో `ఖ‌లేజా` చేస్తూ మ‌హేష్‌ బిజీగా ఉన్నాడు. పైగా దూకుడు మూవీకి కూడా అప్ప‌టికే క‌మిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మ‌హేష్ సున్నితంగా బృందావనంను తిరస్కరించాడు. దాంతో ఎన్టీఆర్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక బృందావనం మిస్ అయినా.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలోనే మహేష్ `మహర్షి` మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.