అట్లీ ప్లానింగ్ అదుర్స్.. ఈసారి టార్గెట్ ఏకంగా 3 వేల కోట్ల.. !!

కోలీవుడ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఏడాది జవాన్ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా ఎంటర్ అయింది. జవాన్ ముందు కూడా అట్లీ తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అందుకున్నాయి. ఇక ఇప్పటికి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా కొన్ని ప్రదేశాల్లో స్క్రీనింగ్ అవుతూనే ఉంది. జవాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అట్లీ.. చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఓ చిట్ చాట్ లో పాల్గొన్న అట్లీ తర్వాత ప్రాజెక్ట్ గురించి అడగగా జవాన్ రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసింది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కనీసం రూ.3000 కోట్లు వసూలు చేయాలి.. ఇది జరగాలంటే తప్పక షారుఖ్ ఖాన్ – విజయ్ కలిసి నటించేలా చేయాలి అంటూ వివ‌రించాడు. ఇవ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడని ఇటీవల న్యూస్‌ వైరల్ అయ్యిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముందుగా అట్లీ.. అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడా..? లేదంటే..? విజయ్ – షారుక్ ఖాన్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తాడా..? అనేది వేచి చూడాలి. జవాన్ లో విజయసేతుపతి విలన్ గా నటించగా లేడీస్ సూపర్ స్టార్ నయనతార, దీపిక పదుకొనే లీడ్ రోల్స్ పోషించారు. ఇక జవాన్ లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలకపాత్రలో నటించారు. హై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.