సన్నీలియోన్ ‘ తెలుగు మీడియం ఇస్కూల్ ‘.. ఎనిమిది మంది ఫారినర్స్‌తో ఢిఫ‌రెంట్‌గా.. (వీడియో)

బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్.. మొదట అడల్ట్ చిత్రాల్లో నటించి తర్వాత మెల్లమెల్లగా సినిమాల్లోకి అడుగుపెట్టి న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కరెంటు తీగ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రీవియస్ గరుడవేగా, జిన్నా లాంటి తెలుగు సినిమాల్లో మెప్పించింది. తొలిసారిగా తెలుగు టెలివిజన్ చరిత్రలోనే తెలుగు మీడియం ఇస్కూల్ గేమ్ షో తో అడుగు పెట్టింది. ఈ షోకి సన్నీలియన్ జడ్జిగా వ్యవహరిస్తుంది.

దీనిలో యాంక‌ర్‌ రవి, డ్యాన్సర్ పండు తో పాటు అర్యానా గ్లోరీ, ఫైమా, అప్పల్ రాజు, నటుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ షోలో సన్నీలియోన్ తెలుగు సాంప్రదాయబద్ధంగా చీరకట్టుతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు చూడని విధంగా ఈ షోను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో పలు దేశాలకు చెందిన లోకల్ టాలెంట్ ఆహ్వానించారు. ఆఫ్రికా ఐలాండ్, రష్యా, స్కాట్ ల్యాండ్, జపాన్, యూఎస్ఈ ఐదు దేశాలకు చెందిన 8 మందిని పిలిపించారు.

విదేశీయులతో తెలుగు బుల్లితెర సెలబ్రిటీలు జంటగా ఫన్ క్రియేట్ చేయబోతున్నారని విషయాన్ని ప్రోమో ద్వారా వెల్లడించారు. ఇక ఈ ప్రోమోతో షోపై మరింత హైస్‌ పెరిగింది. సన్నీలియోన్ కూడా సందర్భానుసారం తనదైన శైలిలో స్పందిస్తూ పంచులు పేల్చుతూ అలరించింది. ఇక మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 8న‌ రాత్రి 9 గంటలకు జీ తెలుగు, జీ సినిమాల్లో టెలికాస్ట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 15న రిలీజ్ చేస్తారు. ఇక ఈ షో రిలీజై ఎటువంటి రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.