Bigg Boss 7 :హౌస్‌లో మరో అదిరిపోయే ట్విస్ట్.. కొత్త కంటెస్టెంట్ల చేతిలో నామినేషన్స్‌..?!

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్ మేట్లకు నిన్న ఒక్కసారిగా జలక్ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్ లోకి దించాడు. వీరుతోనూ ఆడి గెలవాలని చాలెంజ్ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్ లో ఉన్న పాత కంటిస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్ బాస్.

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో పోటుగాళ్లు మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇంకేముంది హౌస్ లో ఉన్న ఆటగాళ్లంతా చేసేది ఏం లేక బిక్కమొహం వేసుకుని కూర్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారు ముఖంపై స్టాంప్ మార్క్ వేసి అందుకు తగిన కారణాలు చెప్పాలన్నాడు బిగ్ బాస్. మొదటగా నయని పావని.. తేజ గేమ్ ఆడినట్లు కనిపించలేదని తనను నామినేట్ చేసింది. గౌతమ్ మెడపై బెల్ట్ పెట్టి కొట్టిన విషయంపై తేజను పూజ సైతం నామినేట్ చేసింది. స్వార్ధంగా ఆలోచిస్తున్నావ్ అంటూ అమర్దీప్ ముఖంపై స్టాంప్ మార్క్ వేసింది అశ్విని శ్రీ.

తర్వాత అశ్విని శ్రీ.. శోభా శెట్టి ని నామినేట్ చేసింది. అయితే పదే పదే గ్రూప్ ఇజం అనడంతో తట్టుకోలేకపోయింది శోభ. ఏంటి గ్రూపిజం? గ్రూప్ ఇజం వల్ల మీరు నష్టపోయారా? వేరే వాళ్ళు నష్టపోయారా? అని ఫైర్ అయ్యింది. ఇకపోతే మొదట పోటుగాళ్లకు ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్ తర్వాత ఆటగాళ్లకు కూడా నామినేట్ చేసే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఈ వారం అశ్విని, నయని పావని, పూజ మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్ లో ఉన్నారు.