భగవంత్ కేసరి సినిమా సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్..!!

నరసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించడం జరిగింది. కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురీ పాత్రలో నటించింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ పైన డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ప్రశ్నలు ఎదురుగా పలు విషయాలను తెలియజేశారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.. భగవంత్ కేసరి సినిమా కోసం తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనిల్ రావిపూడి..

తనకి ఈ సినిమా సీక్వెల్ తీసే ధైర్యం లేదని తెలిపారు. భగవంత్ కేసరి సినిమా బరువు మోసినందుకే చాలా నలిగిపోయాను.. ఇప్పుడు సీక్వెల్ తీయగలిగే శక్తి బాలకృష్ణ గారు నాకు ఇస్తే వెంటనే తీస్తానని తెలిపారు. దీంతో భగవంత్ కేసరి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి మరి.