తన బయోపిక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రవితేజ..!!

హీరో రవితేజ డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ కేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఎలాగైనా ఈసారి కచ్చితంగా రవితేజ పాన్ ఇండియా హీరో అనిపించుకుంటారని అభిమానుల సైతం చాలా ఆత్రుతగా ఉన్నారు. రవితేజ ఎక్కువగా బాలీవుడ్ పైన ఫోకస్ పెడుతూ అక్కడ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రవితేజ తన జీవితంలో బయోపిక్ చేయవలసి వస్తే అని ప్రశ్న అడగగా అందుకు ఆసక్తికరమైన సమాధానాన్ని తెలిపారు ..

రవితేజ మాట్లాడుతూ తన బయోపిక్ పైన స్పందిస్తూ.. ఒకవేళ నా బయోపిక్ వస్తే ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ జూనియర్లోనే ఉంటుంది..నా బయోపిక్ లో నేను నటిస్తానని చెప్పారు అయితే బయోపిక్ టైటిల్ అని అడగగా అక్కడ ఉన్న కొంతమంది మాస్ మహారాజా అంటూ పిలవడం జరిగింది. రవితేజ కూడా తన బయోపిక్ తీస్తే మాస్ మహారాజా అనే టైటిల్ ని కూడా సెట్ చేస్తానంటూ తెలిపారు. దీంతో రవితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. మొదట జూనియర్ ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, పనిచేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి హీరోగా మారి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ సినీ లైఫ్ గురించి చెప్పాల్సిన పని లేదు.