మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కమ్ పలికారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లో అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు.
అయితే ఇంతవరకు ఉపాసన తమ కూతురు ఎలా ఉంటుందో చూపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా తమ ముద్దుల ప్రిన్సెస్ తో రామ్ చరణ్, ఉపాసన ఫస్ట్ ఫారెన్ ట్రిప్ కు బయలుదేరారు. తాజాగా కూతురుతో కలిసి ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో దర్శనం ఇవ్వగా.. కెమెరామెన్స్ వారి ఫోటోలు క్లిక్ మనిపించారు. ప్రస్తుతం అవి కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఇక్కడ కూడా క్లీన్ కారా ఫేస్ కనపడకుండా ఉపాసన జాగ్రత్త పడింది. అన్నట్లు ఈ బుల్లి ఫ్యామిలీ ఎక్కడకు వెళ్తున్నారో చెప్పలేదు కదా ఇటలీ. ఈ ట్రిప్ రామ్ చరణ్ దంపతులకు ఖచ్చితంగా మెమరబుల్గా మారుతుంది అనడంలో సందేహం లేదు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.