సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదేళ్ల వయసులోనే సోషల్ మీడియా ద్వారా భారీ ఫ్యాన్ ఫాలింగ్ సంపాదించుకున్న సితార.. ఈమధ్య మీడియాకు మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా సితారే కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక విధంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది.
అతి చిన్న వయసులో ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ PMJ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలకు సైకిళ్లు కొనిచ్చింది. మొన్నటికి మొన్న ఓ కార్యక్రమంలో పేదలకు, వృద్ధులకు గిఫ్ట్స్ అందజేసింది. అలాగే షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా తల్లి నమ్రతతో కలిసి హాజరవుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే సితారను ఈ విధంగా హైలెట్ చేయడం వెనక మహేష్, నమ్రత దంపతుల ప్లానింగ్ ఉందని టాక్ నడుస్తోంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా మహేష్ బాబు విషయంలో ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు మహేష్ బాబును కృష్ణగారు కూడా తెగ హైలెట్ చేశారు. అనంతరం హీరోగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను మహేష్ తన కూతురు విషయంలోనూ ఫాలో అవుతున్నాడట. సితార హీరోయిన్ అవ్వాలని ఆశపడుతోంది. అందుకే ఈ మధ్య సితారపై మీడియా ఫోకస్ ఎక్కువగా పడేలా మహేష్, నమ్రత దంపతులు ఆమెను హైలెట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.