బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు సరికొత్త గేమ్ ప్లానింగ్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ షో నుంచి ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉండగా.. ఈ వారం మరొకరు ఇంటి బాట పట్టబోతున్నారు. అయితే ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే.. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.
ఇందుకోసం అక్టోబర్ 8న మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. అర్జున్ అంబటి, అంజలి పవన్, పూజా మూర్తి, నయని పావని పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా మరొకరి పేరు తెరపైకి వచ్చింది. తను మరెవరో కాదు జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్.
స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న `గుప్పెడంత మనసు` సీరియల్ ద్వారా బుల్లితెరపై యమా ఫేమస్ అయిన జ్యోతిరాయ్.. బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నారు నెటిజన్లు. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్ర మరణించిన సంగతి తెలిసిందే. కొడుకు ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను అడ్డుపెట్టి.. శత్రువుల చేతిలో జగతి మరణించింది. ఆమె సడెన్ డేత్ ప్రేక్షకులకు పెద్ద షాకనే చెప్పాలి. అయితే జగతి మేడమ్ బిగ్ బాస్ షోలోకి రాబోతోందని.. అందుకే అంత సడెన్ గా ఆమె పాత్రను క్లోజ్ చేశారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.