అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేసిన మ‌హేష్‌.. పుసుక్కున అంత మాట‌న్నాడేంటి?

టాలీవుడ్ లో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త శిరోద్క‌ర్ జంట ఒక‌టి. రీల్ లైఫ్‌లో జంట‌గా న‌టించి.. రియ‌ల్ లైఫ్ లో భార్య‌భ‌ర్త‌లుగా మారిన మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌లు సుధీర్గ కాలం నుంచి త‌మ వైవాహిక జీవితాన్ని స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తూ ఎంద‌రో దంప‌తుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు స్వ‌స్థి ప‌లికిన న‌మ్ర‌త‌.. పిల్ల‌ల బాధ్య‌త‌తో పాటు భ‌ర్త‌కు సంబంధించిన అన్ని విష‌యాలు ద‌గ్గ‌రుండి చూసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ క‌పుల్ తొలిసారి ఓ షోరూమ్ ఓపెనింగ్ కు జంట‌గా వ‌చ్చారు. జూబిలీ హిల్స్​లోని తమ ఫ్రెండ్స్ డిజైనర్ షాప్ ఓపెన్ చెయ్యడానికి మ‌హేష్, న‌మ్ర‌త క‌లిసి వెళ్లారు. షాప్ ఓపెనింగ్ అనంత‌రం మ‌హేష్‌, న‌మ్ర‌త క‌లిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రిపోర్ట‌ర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చాలా ఓపిగ్గా స‌మాధానాలు చెప్పారు.

`నమ్రతకు ఎప్పుడైనా మీరు బట్టలు కొన్నారా..?` అని ఓ రిపోర్ట‌ర్ అడగగా.. మహేష్‌​ బాబు `లేదు, నేను ఎప్పుడూ కొనలేదు. ఎందుకంటే నాకు అంతగా సెలక్షన్ రాదు. నిజం చెప్పాలంటే నా బట్టలు కూడా నమ్రతనే షాపింగ్ చేస్తుంది` అని ఆన్స‌ర్ ఇచ్చాడు. మ‌రో రిపోర్ట‌ర్ `నమ్రతాకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటుకుంటే ఏం ఇస్తారు..?` అని ప్రశ్నించారు. అందుకు మహేష్ బాబు పుసుక్కున‌.. `త‌ను మొత్తం షాప్ కావాలంటుంది` అని బ‌దులిస్తూ అంద‌రి ముందు న‌మ్ర‌త ప‌రువు తీసేశారు. అయితే మ‌హేష్ స‌ర‌దాగానే ఈ కామెంట్స్ చేయ‌డంతో అంద‌రూ న‌వ్వేశారు. ఇక ఫ‌స్ట్ టైమ్ వైఫ్‌తో ఇలా ప్రెస్ మీట్ లో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉంద‌ని మ‌హేష్ తెలిపారు. అలాగే త‌న ఫ్రెండ్స్ కోస‌మే ఈ షాపు ఓపెనింగ్​ వచ్చానని, ఇది తన బ్రాండింగ్​లో పార్టు కాదని ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు.