10 లక్షలు ఖర్చుపెట్టి బిగ్ బాస్ కి వెళితే.. 30 వేలు ఇచ్చి పంపించారు..!!

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నయని పావని. హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి టాస్క్ లోను 100% ఇస్తూ అవసరమైన దగ్గర మాత్రమే మాట్లాడుతూ మెచ్యూర్డ్‌గా చూడగా బిహేవ్ చేసింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అందరిలో నయిని పావని ద బెస్ట్ అనిపించుకుంది. అయితే ఆట ఎంతో బాగా ఆడుతున్న ఈ బ్యూటిని హఠాత్తుగా వచ్చిన వారానికే ఎలిమినేట్ చేశారు. దీంతో హౌస్ లో కాంటెస్ట్ంట్స్‌ అంతా కంటతడి పెట్టుకున్నారు.

శివాజీ తను ఆట బాగా ఆడుతుంది సార్.. ఆ అమ్మాయి బదులు నన్ను ఎలిమినేట్‌ చేయండి అంటూ నాగార్జునతో అనగా ఇది ప్రేక్షకుల డెసిషన్ మనమేం చేయలేం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే ఇన్నేళ్ళ‌లో ఒక కంటిస్టంట్‌ ఎలిమినేట్ అయితే హౌస్ మేట్స్ అందరూ ఏడవడం ఇదే మొదటిసారి అన్ని నాగ్ అన్నాడు. ఎలిమినేట్ అయిన ప్రతి వ్యక్తి మేం జనం మనసు గెలిచామని చెప్తూ ఉంటారు కానీ నాయని పావని నిజంగానే ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. దీంతో ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కావాలనే శోభాశెట్టి అనే కన్నడ బ్యూటీని సేవ్ చేయడానికి బిగ్ బాస్ నయని పావనిని ఎలిమినేట్ చేశారంటూ ఫైర్ అవుతున్నారు.

అచ్చ తెలుగు ఆడపిల్ల అయినా నయ‌ని గేమ్ అంత బాగా ఆడిన ప్రేక్షకులకు ఓట్లు తక్కువ వేశారని అబద్దం చెప్పి అన్యాయంగా నయ‌నిని బయటకు పంపించేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నైటిజన్లుచ‌ ఇక నైనీ పావని బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు వరకు ఆస్ట్రేలియాలో ఉన్నారు. పెద్ద సెలబ్రిటీ కాకపోవడంతో రెమ్యూనరేవషన్ కూడా ఈమెకి చాలా తక్కువగానే ఇచ్చారట. అయితే రోజుకు రూ.30 వేల చొప్పున ఇచ్చిన.. ఆమె వారం కూడా ఉండలేదు.. దీన్నిబట్టి ఆమెకి కేవలం రూ.1,80,000 వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే ఆస్ట్రేలియా నుంచి ఆమె రావడానికి దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీంతో అక్కడి నుంచి అంత ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన సరే ఆమెకి అన్యాయమే జరిగింది. కేవలం రూ. 30,000 రెమ్యూనరేషన్ చేతికి ఇచ్చి పంపించారు అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి రోజు నుంచి ఎలిమినేట్ అయ్యే వరకు ప్రతిరోజు రిమానరేషన్‌ను కంటెస్టెంట్లకు ముట్ట చెబుతారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే నైనిపానికి కచ్చితంగా రూ.10 లక్షలు వరకు రిమ్యున‌రేష‌న్ వస్తుంది.