అక్క‌డ `లియో` మూవీ ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ త్వ‌ర‌లోనే `లియో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. విక్రమ్ మూవీతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా న‌టించింది. సంజయ్ దత్, అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ , మన్సూర్ అలీ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ద‌స‌రా పండుగ కానుక‌గా తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో లియో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. విజ‌య్ ఫ్యాన్స్ చాలా ఈగ‌ర్ గా లియో కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలో వారికి ఓ బిగ్ షాక్ తిగిలింది. విజ‌య్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు లియో మూవీ టిక్కెట్స్ ప్రైజ్ ను భారీగా పెంచేశారు. విజ‌య్ పై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్ లియోను ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూసేందుకు తెగ ఎగ‌బ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు ఒక్కో టిక్కెట్ ధ‌ర రూ. 5 వేలకు అమ్ముతున్నారు. త‌మిళ‌నాడులోని ప్ర‌ధాన న‌గ‌రాలైన చెన్నై, మ‌ధురై, కోయంబ‌త్తూరులో ఈ దంతా జోరుగా సాగుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఒక్కో టిక్కెట్ రూ. 5 వేలా.. ఇలాగైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.