హీరోయిన్ ప్రియాంక చోప్రా -కరీనాకపూర్ మధ్య విభేదాల పై క్లారిటీ ఇచ్చిన కరీనా..!!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన వారిలో హీరోయిన్ ప్రియాంక చోప్రా, కరీనాకపూర్ కూడా ఒకరు.. ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. కరీనాకపూర్ కూడా అంతే స్థాయిలో పేరు సంపాదించడం జరిగింది.గతంలో ఒక సినిమా విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉండేవి అయితే తాజాగా దాదాపుగా 20 ఏళ్లుగా వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదంటూ వార్తలు వినిపించాయి.

తాజాగా ఈ విషయాల పైన క్లారిటీ ఇచ్చేసింది హీరోయిన్ కరీనాకపూర్.. వాస్తవానికి ప్రియాంక చోప్రా తో తనకు ఎలాంటి గొడవ లేదని చెప్పేసింది. మా ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లుగా వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదంటూ తెలిపింది. మా మధ్య కేవలం గట్టి పోటీ మాత్రమే ఉండేదని కెరియర్ విషయంలో బెస్ట్ అనిపించుకునేందుకే చాలా పోటీ పడ్డాము అంతకుమించి మరే కారణం లేదంటూ కూడా తెలియజేయడం జరిగింది. 2004లో ఇద్దరూ ఐత్రాజ్ అరే సినిమాలో కలిసి నటించారట. ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఇలాంటి విషయాల పైన ఎప్పుడు కరీనాకపూర్ కానీ ప్రియాంక చోప్రా గాని స్పందించలేదు. కరీనా కపూర్ ప్రియాంక చోప్రా వల్ల ఎప్పుడు కూడా తనకు ఇబ్బందులు తలెత్తలేదని కూడా అప్పటి మీడియాలో వచ్చిన వార్తలన్నీ కూడా కేవలం అవాస్తవమే అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిలై అక్కడే గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. నిక్ జోనస్ను వివాహం చేసుకున్న తర్వాత ఈమె ఎక్కువగా అక్కడే నటిస్తోంది.