టాలీవుడ్ డైరెక్టర్ రమేష్ వర్మ.. పలు సినిమాలకు ప్రొడ్యూసర్ గా, స్క్రిప్ట్ రైటర్ గా కూడా వ్యవహరించాడు. ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయమయ్యాడు. తర్వాత రైడ్, సెవెన్, రాక్షసుడు, ఖిలాడి లాంటి హిట్ సినిమాలను తర్కెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రమేష్ వర్మ గతంలోబాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కైరా అద్వానీ, టబ్బు ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులైయా 2 సినిమాను అనీస్ భజ్మి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా హారర్ కామెడీని ఇష్టపడే ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని మొదట దర్శకుడు రమేష్ వర్మ భావించాడట. ఫాన్సీ రేటుకు రీమేక్ హక్కులకు కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు వర్షన్ స్క్రిప్ట్ పనులన్నీ కూడా మొదలుపెట్టారు. కానీ రమేష్ వర్మ గతంలో తెరకెక్కించిన రాక్షసుడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. తమిళ్ రాక్షసన్కి రీమేక్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
దీంతో ఆ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు రాక్షసుడు 2 ను తరికెక్కించడం కోసం ఆ సినిమా తెలుగు వర్షన్స్ స్క్రిప్ట్ పక్కన పెట్టేశాడు. ఇక ప్రస్తుతం రాక్షసుడు 2కి రంగాన్ని సిద్ధం చేశారు. బెల్లంకొండ హీరోగా రమేష్ వర్మ రాక్షసుడు 2 చేయబోతున్నారు. అయితే రాక్షసన్ కి సీక్వెల్ తమిళ్లో ఇంకా రాలేదు. రమేష్ వర్మ ఓన్ స్క్రిప్ట్ తయారుచేసి బెల్లంకొండకు వినిపించగా అదే ప్తాంచైజ్ పై ఈ కథ చేయాలని నిర్ణయించుకున్నాడట బెల్లంకొండ. దీంతో భూల్ భులైయా 2ను పక్కన పెట్టి రాక్షసుడు 2 మొదలు పెట్టాడు రమేష్ వర్మ.