హీరో ఒడిలో పడుకోమన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ హీరోయిన్..

దేశం ఏదైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఆడవారిపై లైంగిక వేధింపులు చాలా కామన్. ఇండస్ట్రీలోని వ్యక్తులు తమను లైంగికంగా వేధించినట్లు ఇప్పటికే చాలామంది షాకింగ్ అలిగేషన్స్ చేశారు. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా శ్రీరెడ్డి ప్రముఖులపై షాకింగ్ ఆరోపణలు చేసి ఇండస్ట్రీలోని చీకటి కోణాల గురించి అందరికీ తెలియజేసింది. ఆమె ఒక్కరే కాదు ఇంకా చాలామంది చిత్ర పరిశ్రమలో కమిట్మెంట్స్ ఉంటాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.

మామూలు నటీమణులకు మాత్రమే స్టార్ హీరోయిన్లకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా అలనాటి స్టార్ హీరోయిన్ సుహాసిని కూడా ఇండస్ట్రీలో ఆడవారితో ఎంత చీప్ గా ప్రవర్తిస్తారో తెలిపింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కొత్తలో చాలామంది డైరెక్టర్లు అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించమని బాగా అడిగే వారిని కానీ అవన్నీ తాను తిరస్కరించుకుంటూ వచ్చానని తెలిపింది. ఒక సినిమాలో పద్ధతి అయిన పాత్ర అని ఒప్పుకుంటే ఆ తర్వాత డైరెక్టర్ చాలా ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది. ఆ చేదు జ్ఞాపకాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ.. “కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమాని ఒప్పుకున్నాను. సినిమా మధ్యలోకి వచ్చిన తర్వాత డైరెక్టర్ హీరో ఒడిలో కూర్చోవాలని, పడుకోవాలని నన్ను బాగా బలవంతం చేశాడు. ఈ సన్నివేశం చేయలేను అని చెప్పినా… సినిమా బాగా రావాలంటే నువ్వు ఇది చేయాల్సిందేనని అతడు పట్టుబట్టాడు. నాకు బాగా కోపం వచ్చింది. అసలు నేను ఈ సినిమాలో చెయ్యను పో అని కరాకండిగా చెప్పేశాను.” అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమా ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరు? అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

మరో డైరెక్టర్ చెత్త బిహేవియర్ గురించి కూడా ఆమె మాట్లాడింది. ఒక సినిమాలో హీరో తిన్న ఎంగిలి ఐస్ క్రీమ్ తినాలంటూ సదరు డైరెక్టర్ సుహాసినిని బాగా ఇబ్బంది పెట్టాడట. “ఇది యాక్టింగ్ మాత్రమే, వేరే ఐస్ క్రీమ్ తీసుకురండి, ఆయన తిన్నది తిన్నట్లు యాక్షన్ చేస్తా, అంతేకానీ నిజంగా తినమంటే ఎలా తింటామ”ని సుహాసిని అతడికి చివాట్లు పెట్టిందట. ఏదేమైనా సుహాసిని ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్స్పోజింగ్ చేయకుండా పద్దతైన పాత్రలు చేసి మంచి గుర్తింపు, మర్యాదను దక్కించుకుంది.