ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ డైరెక్టర్ తో జతకట్టనున్న ప్రభాస్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ దక్కించుకున్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించి.. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాతో డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. అప్పటి నుంచి ఆయన ఒక మంచి హీరోగా పేరు దక్కించుకున్నారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేసి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్.. మళ్లీ అదే రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ప్రభాస్ ఎంతోమంది స్టార్ డైరెక్టర్లతో నటించారు అయినా కూడా ఆయన అభిమానులు మాత్రం త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు అని తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ తో రాసే డైలాగులను ప్రభాస్ చెప్తే చాలా అద్భుతంగా ఉంటుందని.. అందుకే వీరిద్దరి కాంబోలో సినిమాలు రావాలి అని అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నా.. వీరిద్దరి కాంబోలో మాత్రం సినిమా సెట్ కావట్లేదు. అయితే దీనికి గల కారణం మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారనే చెప్పాలి. ఇదిలా ఉండగా మరొకవైపు ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా పడితే కచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

 

ప్రేక్షకులలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అంచనాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా అనే టాపిక్ ని ఇంతవరకు ఎప్పుడు తీసుకురాలేదు. త్రివిక్రమ్ ఎప్పుడూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అంటూ వారి చుట్టూనే తిరుగుతున్నాడు .ఒకవేళ ఈ కాంబోలో గనుక సినిమా వస్తే సూపర్ హిట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్నది క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో సినిమా వస్తుందని అభిమానులు కోరుకున్నట్టుగానే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి అభిమానుల కోరిక ఇప్పట్లో నెరవేరుతుందేమో చూడాలి.