బిగ్ బాస్ హౌస్ లోకి ఐదుగురు వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ…. ఎవరో తెలుసా…!!

బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ఇంటి నుంచి నలుగురిని పంపించి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ 7 కొత్త మార్పులను తీసుకొచ్చి రేటింగ్స్ లో దూసుకెళ్తోంది. తాజాగా తోలి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అర్జున్ అంబటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటినుంచో మనోడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తున్నట్లు హింట్లు ఇస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు హౌస్ లోకి అడుగుపెట్టాడు. సెకండ్ కంటెస్టెంట్ ఎవరంటే.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోయడంలో ఈ ముద్దుగుమ్మ ముందు వరుసలో ఉంటుంది.

ఆమె మరెవరో కాదు అశ్విని శ్రీ. తాజాగా హౌస్ లో రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఊ అంటావా మావా పాటతో స్టేజిని ఓ ఊపు ఊపేసింది. రావడంతోనే ప్రియాంక, శోభా శెట్టి సరిగ్గా ఆడటం లేదని తెలిపింది. తనొక కిక్ బాక్సర్ అంటున్న అశ్విని శ్రీ తనతో గొడవ పడితే ఎవరైనా సరే కొట్టేస్తానంటుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోనూ ఈ అమ్మడు ఇదే జోరు చూపిస్తుందో? లేదో చూడాలి. ఒక్క పాటతో సెన్సేషనల్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా. వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. చక్రి దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్ గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు.

బతుకమ్మ, బోనాల పండుగ సమయంలో ప్రత్యేక పాటలతో అందరినీ అలరించాడు. తన టాలెంట్ తో బిగ్ బాస్‌షోకి వచ్చాడు. గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజ మూర్తి మనందరికీ తెలిసిందే. ఈమె ఈ సీజన్ ప్రారంభంలోనే హౌస్ లోకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఆమె తండ్రి మరణించడంతో ఆగిపోయింది. ఆమె వీడియో చూపించి అందరిని కంటతడి పెట్టించారు. మరి ఈమె పై సింపతి పెరుగుతుందో లేదో.. హౌస్ మేట్స్ కు గట్టి పోటీ ఇస్తుందో లేదో చూడాలి. ఇక నైనీ పావని సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తీరా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. మరి బిగ్ బాస్ లో కొనసాగుతుందో లేదో చూడాలి.