హౌస్ లో నుంచి ఒకేసారి ఇద్దరు ఎలిమినేట్.. షాక్ లో ఉన్న కంటెస్టెంట్స్.. ట్విస్ట్ అదుర్స్‌..!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 నాగార్జున ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే ప్రస్తుతం రసవక్తంగా కొనసాగుతుంది. నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా.. ఐదో వారం కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యం. కాగా ఐదవ ఎలిమినేషన్ విచిత్రంగా జరిగింది. ముందు ఎలిమినేషన్ తోనే షో స్టార్ట్ కావడం విశేషం. ఈవారం ఎలిమినేషన్ లో ఏడుగురు ఉన్నారు. వీరులో శివాజీ, తేజ, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, యావర్, శుభశ్రీ ఉన్నారు.

అయితే నాగ్ ఎంట్రీ తోనే నామినేషన్తో ఈ ఎపిసోడ్ ప్రారంభమవుతుందని చెప్పాడు. నామినేషన్ లో ఉన్న ఏడుగురిని చీకటి గదిలోకి తీసుకువెళ్లి భయపెట్టి మరి నామినేట్ చేశారు. ప్రిన్స్, తేజ, గౌతమ్, శుభ శ్రీ లను టచ్ చేసిన దెయ్యం.. చివరకు దెయ్యం శుభశ్రీని తీసుకువెళ్లిపోయింది. ఐదో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయిందని అంతా షాక్ అయ్యారు.

శుభశ్రీని ఎలిమినేట్ చేశాక.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. కానీ గౌతమ్ ఎలిమినేట్ కాలేదు. ఎలిమినేట్ అయినట్లు నాగార్జున స్టేజ్ పైకి తీసుకువెళ్లి.. సీక్రెట్ రూమ్ లో ఉండాలని చెప్పాడు. కానీ గౌతమ్ ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో ఉన్నట్లు హౌస్ లో వాళ్లకి తెలియదు. హౌస్ మేట్స్ అందరూ గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడనే అనుకున్నారు.