మంత్రి రోజాకు సపోర్టుగా సినీనటి కవిత.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్..!!

సినీనటి , వైసిపి మంత్రి రోజా పైన గత రెండు రోజుల క్రితం టిడిపి నేత బండారు సత్యనారాయణ పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా అత్యంత నీచంగా మాట్లాడడంతో చాలా మంది అభిమానులు పలువురు నేతలు సైతం ఆయన పైన ఫైర్ కావడం జరిగింది. ఇప్పుడు తాజాగా సినీ నటి కవిత కూడా మండిపడడం జరిగింది. రాజకీయాలలో టిడిపి నేతలు చాలా దిగజారిపోతున్నారు అంటూ మహిళలు రాజకీయాలలోకి రావాలి అంటే భయపడుతున్నారంటూ బండారు పైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

టిడిపి నాయకులను చూసి ప్రజలే అసహ్యించుకునే విధంగా మాట్లాడుతున్నారని ఇలాంటి నీచమైన భాషలతో మహిళలపై టిడిపి నేతలు మాట్లాడుతూ ఉండడంతో ప్రతి ఒక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారంటూ కవిత కామెంట్స్ చేసింది..రోజా పైన బండారు చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా అతనిని చెప్పుతో కొడతారు అంటూ తెలియజేసింది. బండారు ఇంట్లో ఉన్న మహిళలు ఇలాంటి మాటలను ఆమోదించగలరా నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, బండారు వ్యాఖ్యలను ఖండించాలని ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి మహిళల పైన టిడిపి నేతలు అసభ్యకరంగా ఇలా మాట్లాడుతూ ఉంటే వీటిని ఖండించరా అంటూ కవిత వారి పైన ఫైర్ కావడం జరుగుతోంది.

ఈ మధ్యకాలంలో పలువురు నేతలు కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండడంతో ప్రజలు కూడా టిడిపి నేతలను చూసి చాలా భయభ్రాంతులకు గురవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరికి సపోర్టుగా పవన్ కళ్యాణ్ కూడా ఉండడంతో ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందంటూ తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం పైన ఇంకా ఎవరెవరు స్పందిస్తారో చూడాలి.