వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ధీటుగా ఎదురుకుని ఎన్నికల్లో విజయం సాధించాలని అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు దూకుడుగా ఉన్న పార్టీ చంద్రబాబు అరెస్ట్ తో అయోమయంలో పడింది. బాబుకు మద్ధతుగా టిడిపి నేతలు సైతం పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నారు. అటు లోకేష్ ఏమో ఢిల్లీకి వెళ్ళి హడావిడి చేస్తున్నారు.
కానీ అక్కడ లోకేష్ కు మద్ధతు దక్కడం లేదు. పైగా లోకేష్ అరెస్ట్ కూడా జరుగుతుందని ప్రచారం వస్తుంది. అదే జరిగితే టిడిపికి భారీ నష్టం తప్పదు. ఇప్పటికే టిడిపిపై ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది. ఇక బాబు అరెస్ట్ తో ప్రజలు మరింతగా టిడిపి ని లైట్ తీసుకుంటున్నారు. అటు టిడిపితో పొత్తు అని పవన్ ప్రకటించారు. కానీ జనసేన శ్రేణులు పూర్తిగా టిడిపితో కలవడానికి ఆలోచిస్తున్నారు. అధికార వైసీపీ ఇంకా దూకుడుతో ముందుకెళుతుంది. ఇటు ఏమో టిడిపి నాయకత్వ లోపం బాగా ఉంది.
ఇక బ్రహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..టిడిపిని నడిపిస్తారని ప్రచారం వస్తుంది. కానీ అది జరిగే అవకాశం లేదు. పైగా రాజకీయంగా బ్రహ్మణికి పెద్ద పట్టు లేదు. మామూలుగా బాలకృష్ణకే పార్టీపై పట్టు లేదు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీ కోసం ఏం చేయాలనే అంశం బాబుకు తెలిసినట్లుగా మిగతా వారికి తెలియదు.
కాబట్టి బ్రహ్మణి రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు. అటు బాలయ్య మళ్ళీ సినిమా షూటింగ్ల్లో బిజీ అయిపోయారు. ఇదే సమయంలో లోకేష్ కూడా అరెస్ట్ అయితే మాత్రం సీన్ మారుతుంది. టిడిపి ఇంకా నష్టపోతుంది.