ఖైదీ సినిమా సీక్రెట్ అప్డేట్ ఇచ్చిన కార్తీ..!!

తమిళ హీరో కార్తీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన పవర్ ఫుల్ చిత్రం ఖైదీ.. ఈ సినిమా 2019లో విడుదలై కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ సినిమా ఎండింగ్లో సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దీంతో సీక్వెల్ కోసం ప్రతి ఒక్కరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

rspnetwork.in: Karthi's Khaidi Movie Stills

ఇటీవలే లోకేష్ తెరకెక్కించిన విక్రమ్ సినిమాలో ఖైదీ సినిమాలోని కార్తీ పాత్రను కూడా పరిచయం చేసి సెకండ్ పార్ట్ పైన మరింత హైప్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు లియో సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నారు.. ఆ తర్వాతే ఖైదీ-2 సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఒక ఇంటర్వ్యూలో కార్తీ ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా అప్డేట్ వస్తుందని కార్తీ తెలియజేయడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఖైదీ సినిమా సీక్వెల్ రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో సూర్య కూడా కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఢిల్లీ అండ్ రోలెక్స్ ఈక్వల్ లో కనబడి ఆడియోస్ని త్రీల్ చేస్తారో లేదో చూడాలి మరి. కార్తీ సినిమాల విషయానికి వస్తే జపాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది డబ్బింగ్ కూడా ఇటీవల పూర్తి చేసినట్లు తెలియజేశారు. దీపావళి పండుగకి ఈ సినిమాకి తీసుకురాబోతున్నారు.