కూతురును వదిలేసి సడెన్ గా ప్యారిస్ వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. కారణం ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవలే పేరెంట్స్ గా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమ బేబీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా ఈ దంపతులు తమ కూతురును వదిలేసి సడెన్ గా ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.

అయితే వీరిద్దరూ ఎక్కడకు వెళ్తున్నారు..? ఎందుకు వెళ్తున్నారు..? అనేది మాత్రం తెలియలేదు. తాజాగా ఈ విషయం బయటపడింది ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసన ప్యారిస్ లో ఉన్నారు. అయితే వీరిద్దరూ వెకేషన్ కు వెళ్లారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఫ్యారిస్ లో ఓ మ్యారేజ్ కి రామ్ చరణ్ దంపతులు అటెండ్ అయ్యారు. తాజాగా ఈ వెడ్డింగ్ లో రామ్ చరణ్ దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పిక్ లో రామ్ చరణ్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు.

ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ఫరాజ్ మనన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన లేత గోధుమ రంగు సూట్ ని ధరించిన రామ్ చరణ్.. డోల్డెన్ ఫినిషింగ్ తో కూడిన బ్లాక్ వెల్వెట్ షూస్, గోల్డెన్ వాచ్, సన్ గ్లాసెస్ తో తన లుక్ ను పూర్తి చేశాడు. వెడ్డింగ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. రామ్ చరణ్ క్లాసీ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఆఖరి షెడ్యూల్ కు చేరుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ అనంతరం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు.