`ఖుషి` ఓటీటీ పార్ట్‌న‌ర్ లాక్‌.. భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి` నేడు గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి ఆల్మోస్ట్ పాజిటివ్ రివ్యూలే వ‌స్తున్నాయి. రొటీన్ స్టోరీ అయిన‌ప్ప‌టికీ కొత్త‌ర‌క‌మైన నేప‌థ్యాన్ని చూపిస్తూ సినిమాను ద‌ర్శ‌కుడు బాగా న‌డిపించాడు.

అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత ఇద్ద‌రూ త‌మ పాత్ర‌ల్లో జీవించేశారు. వీరి కెమిస్ట్రీ బాగా హైలెట్ అయింది. అలాగే ఈ సినిమాకు కామెడీ పెద్ద బలంగా నిలిచింది. సాంగ్స్ అన్నీ ఆక‌ట్టుకున్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా ఓవరాల్‌గా ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రేక్ష‌కులు ఫీల్ అవుతున్నారు. టాక్ అనుకూలంగా ఉండంతో.. ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక‌పోతే ఖుషి ఓటీటీ పార్ట్‌న‌ర్ లాక్ అయింది. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఖుషి డిజిట‌ల్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు సొంతం చేసుకుంది. సుమారు రూ. 30 కోట్లు వెచ్చించి ఖుషి అన్ని భాష‌ల డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింద‌ని అంటున్నారు. ఇక థియేట‌ర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల త‌ర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబ‌ర్ రెండు లేదా మూడో వారంలో ఖుషి నెట్‌ఫ్లిక్స్ లో సంద‌డి చేసే అవ‌కాశాలు ఉన్నాయి.