ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్యారేజ్ లో మరో లగ్జరీ కారు వచ్చిన సంగతి తెలిసిందే. మెర్సిడీస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్ కారును రకుల్ తన సొంతం చేసుకుంది. ఈ కారు విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. కొత్త కారు ముందు దిగిన ఫోటోలను రకుల్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. సినీ సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ ఆమె కంగ్రాట్స్ తెలిపారు.
అయితే ఇప్పుడు రకుల్ కొత్త కారు గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. రూ. 3 కోట్లు విలువ చేసిన ఆ లగ్జరీ కారును రకుల్ ఫ్రీగా కొట్టేసిందట. కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోకు రకుల్ కు ఆ బెంజ్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడట. సదరు హీరోకు చాలా రోజుల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ నై ఇంట్రెస్ట్ ఉందట. అది గమనించిన రకుల్ సదరు హీరోతో కాస్త క్లోజ్ గా ఉండటం స్టార్ట్ చేసిందట. ఈ నేపథ్యంలో రకుల్ కోసం ఆ కోలీవుడ్ హీరోను కాస్ట్లీ కారును గిఫ్ట్ గా పంపి సర్ప్రైజ్ చేశాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. రకుల్ ఈ మధ్య బాలీవుడ్ పై బాగా ఫోకస్ పెట్టింటి. తెలుగులో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి బాలీవుడ్లోనే నటించింది. కానీ, అక్కడ సక్సెస్ కాలేకపోయింది. దీంతో రకుల్ చూపులు మళ్లీ టాలీవుడ్ లో పై పడ్డాయి. తెలుగులో చిరంజీవి `మెగా 156`లో రకుల్ కు హీరోయిన్స్ ఛాన్స్ వస్తుందని అంటున్నారు. అలాగే తమిళంలో ఇండియన్ 2, అయాలన్.. బాలీవుడ్ లో మేరే హస్బెండ్ కీ బీవీ, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో రకుల్ నటిస్తోంది.