డైరెక్టర్ క్రిష్ -పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు జరిగాయా..?

పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ఆయన కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఉన్నప్పటికీ ఇలాంటి జోనర్ ని మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. సుమారుగా రూ .250 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 50% సినిమాస్ షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన భాగాన్ని షూటింగ్ చేయవలసి ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోతుందనే విషయాన్ని తెలియజేశారు.

taran adarsh on X: "PAWAN KALYAN - KRISH FILM: TITLE + FIRST LOOK... # PawanKalyan and director #Krish's new collaboration is titled  #HariHaraVeeraMallu... Simultaneous release in #Hindi, #Telugu, #Tamil,  #Kannada and #Malayalam on #

కానీ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఈ చిత్రం అనుకోకుండా మధ్యలోనే ఆగిపోయింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో నటించారు..కేవలం 23 రోజుల డేట్లను కేటాయించి ఈ చిత్రాన్ని పూర్తి చేశారు..ప్రస్తుతం Og, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. కాని హరిహర వీరమల్లు సినిమాకి మాత్రం డేట్లు కేటాయించడం లేదు..

దీంతో నిర్మాత ఏ.ఏం రత్నం డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం చాలా కాలం నుండి వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం. నిర్మాత మాత్రం ఈ ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంత ఆలస్యం చేయడానికి డైరెక్టర్ క్రిష్ కారణమని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి గుబురు గడ్డంతో ఎర్రని వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ సింహం లాగా ఉన్నాడనే విదంగా ఒక పోస్టర్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విషయం పైన డైరెక్టర్ క్రిష్ స్పందించలేదు. దీంతో ఈ ప్రాజెక్టు పైన డైరెక్టర్ అసహనంతో ఉన్నారని లేకపోతే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ మధ్య విభేదాలు వచ్చాయా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.