మెగాస్టార్ చిరంజీవి ఇంట నిన్న రక్షా బంధన్ వేడుకలో ఘనంగా జరిగాయి. చిరంజీవికి ఆయన చెల్లెళ్లు విజయ దుర్గ మరియు మాధవి రావు రాఖీ కట్టారు. అనంతరం అన్న దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అందరితోనూ పంచుకున్నారు. అయితే ఈ పిక్స్ లో చిరంజీవికి ఉన్న వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఎక్కువగా కాస్ల్టీ వాచ్ లతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. కానీ, ఈ మధ్య చిరంజీవి తనయుడికి పోటీ వస్తున్నాడు. ఖరీదైన వాచ్ లను ధరిస్తూ హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. ఇక రక్షా బంధన్ వేడుకల్లో చిరంజీవి చేతికి రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ వాచ్ ను ధరించారు.
ఈ వాచ్ రేటు ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఎందుకంటే దాని ధర రూ. 2.35 లక్షల డాలర్లు. మన ఇండియన్ కరెన్సీ రూ. 2 కోట్లు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఆ ఒక్క వాచ్ కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల భోళా శంకర్ తో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈయన తన తదుపరి ప్రాజెక్ట్స్ అయిన మెగా 156, మెగా 157 పై దృష్టి పెట్టాడు. మెగా 156ను కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, మెగా 157ను బింబిసార ఫేమ్ శ్రీ వశిష్ఠ్ తో చేయబోతున్నాడు.