“మామ జైలు కి..అల్లుడు టూర్ కి”.. నందమూరి పరువు రోడ్డుకెక్కించేసారుగా..!!

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో .. ఏపీ రాజకీయాలలో.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఎంత హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టు అయినప్పటి నుంచి అందరి కళ్ళు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వైపే మళ్లాయి. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దూరం పెట్టింది అని .. అసలు నందమూరి ఫ్యామిలీతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు అనే విధంగా బిహేవ్ చేసింది. అయితే అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని ఎన్టీఆర్ తన శక్తికి తగ్గట్టు టిడిపికి మద్దతుగా నిలిచారు.

అయితే ఎప్పుడైతే ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ, టిడిపి పార్టీ ఎలెక్షన్ లు అయిపోయాక దూరం పెట్టిందో అప్పటినుంచి ఎన్టీఆర్ సైతం రాజకీయాలలో ఇలాగే ఉంటుంది అని అర్థం చేసుకొని రాజకీయాలకు దూరంగా ఉన్నారు . అంతేకాదు ఆయన మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలోను .. ప్రతి ఈవెంట్ లోను రాజకీయాలలో రావాలన్న ఆలోచన నాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు . అయితే చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం అందరి కళ్లు ఎన్టీఆర్ వైపే చూసాయి . మామ అరెస్టు అయితే అల్లుడు ఏం పట్టించుకోలేదని .. దారుణంగా ట్రోల్ చేశారు . అయినా సరే ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించలేదు.

అయితే రీసెంట్గా ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లారు. ఓ పక్క మామ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే.. ఏపీ రాష్ట్రం మొత్తం ఆయన కోసం మాట్లాడుతుంది ..సపోర్ట్ చేస్తుంటే ..ఎన్టీఆర్ మాత్రం ఇలా ఏం పట్టనట్లు హ్యాపీగా సైమ అవార్డ్స్ కోసం దుబాయ్ చెక్కేయడం టిడిపి నేతలకు నచ్చడం లేదు. అంతేకాదు ఇదే విషయాన్ని ప్రధానంగా చూపిస్తూ ఎన్టీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పలువురు నందమూరి ఫ్యాన్స్ మాత్రం ” మీరు మీ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా గొడవలు పడి.. నందమూరి ఫ్యామిలీ పరువుని రోడ్డు మీదకి ఈడ్చేసారు.. ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీ అంటే అందరికీ ఎంతో గౌరవం ఉండేది ..ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ ముక్కలు ముక్కలుగా చీలిపోయింది అంటూ అవహేళన చేస్తున్నారు ..”అంటూ రియల్ నందమూరి ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు . దీనికి ఫుల్ స్టాప్ పడాలి అంటే ఎన్టీఆర్.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించక తప్పదు . మరి ఎన్టీఆర్ స్పందిస్తారా..? వేచి చూద్దాం..!!