పాన్ ఇండియా మూవీతో యూట్యూబర్ హర్ష సాయి హీరోగా ఎంట్రీ…. ఆ సినిమా ఇదే…!!

మోస్ట్ ఫేమ‌స్ యూట్యుబ‌ర్‌ హర్ష సాయి తెలుగులో కోట్లాదిమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హర్ష సాయి కేవలం తెలుగు లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చానల్స్ ఓపెన్ చేసి లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బులను కష్టాల్లో ఉన్న వారికి అందించి పేద ప్రజలను ఆదుకుంటున్నాడు. ప్రస్తుతం హర్ష సాయిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది యూట్యూబర్ పేదవారికి సహాయం చేస్తూ # హర్ష సాయి అంటూ టాగ్ చేస్తున్నారు.

గుడిసెల ముందు డబ్బు గుమ్మరించడం, తలదాచుకోవడానికి నీడలేని వారికి ఇల్లు, పిళ్లాడికి సైకిల్, స్కూల్ ఫీజులు ఇలా ఎన్నో రకాలుగా చాలామంది పేద ప్రజలకు సహాయం చేసిన హర్ష సాయి మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. తాజాగా హర్ష సాయి పాన్ ఇండియా లెవెల్ లో మూవీలో నటించబోతున్నాడంటు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దగ్గర బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు ఈ సినిమాను ప్ర‌సెంట్ చేస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ బ్యూటీ మిత్ర శర్మ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

ఆమె సొంత బ్యానర్ అయిన శ్రీ పిక్చర్స్ పై ఇది రూపొందుతోందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డబ్బుల్‌ అప్డేట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 17న ఉదయం 10 గంటలకు ఈ మూవీ టైటిల్, టీజర్ విడుదల చేయబోతున్నట్లు మిత్ర‌ శర్మ తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. ఇది హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతున్నట్లు సమాచారం. అయితే హర్ష సాయి ఎటువంటి సినిమాలో నటించకపోయినా ఎంతోమంది ఫాన్స్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్‌ పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అని.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.