విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై విశ్వ‌క్ సేన్ సెటైర్లు.. మాస్ కా దాస్ కి నోటి దూల ఎక్కువైంది రోయ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఒక‌డు. రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా, న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వ‌క్ సేన్‌.. ఇప్పుడు హోస్ట్ గా కూడా మారబోతున్నాడు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో `ఫ్యామిలీ ధమాకా` సెప్టెంబర్‌ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఈ షోను విశ్వ‌క్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రియాలీ షో గురించి వివరాలు వెల్లడించడానికి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు.

అయితే ఈ ప్రెస్ మీట్ లో విశ్వ‌క్ సేన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ రిపోర్ట‌ర్ `హీరోలంద‌రూ పాన్ ఇండియా లెవెల్ సినిమాలను ప్లాన్ చేస్తుంటే.. మీరేమో ఓటిటి షోకు హోస్ట్ గా చేస్తున్నారు. ఇమేజ్ ప‌రంగా మీ అభిప్రాయం ఏంటి` అంటూ ప్రశ్నించాడు. అందుకు విశ్వ‌క్ సేన్ బ‌దులిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

`ఇమేజ్ పరంగా మనం ఎన్నో లెక్క‌లు వేస్తాం. కొన్నిసార్లు పాన్ ఇండియా అంటూ లెక్కలేసి చేస్తే.. అది గల్లీ సినిమా అవుతుంది. ఇది రూ. 200 కోట్లు, రూ. 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్న సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్ట‌ర్ అవుతుంది. ఒక్కోసారి చిన్న సినిమాలు సూపర్ హిట్ అవుతుంటాయి. పాన్ ఇండియా మూవీస్ అవుతాయి. నా దృష్టిలో సినిమాల పరంగా ప్లానింగ్ అంటే.. చేసుకుంటూ పోవడమే.` అంటూ విశ్వ‌క్ సేన్ సమాధానం ఇచ్చాడు.

అయితే `ఇది రూ. 200 కోట్లు, 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్న సినిమా రిలీజ్ అయ్యాక గల్లి సినిమా అయిపోతుంది` అంటూ విశ్వ‌క్ సేన్ చేసిన కామెంట్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లైగర్ సినిమా గురించే అని.. ఆయ‌న కావాల‌నే సెటైర్స్ వేశాడ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దీంతో రౌడీ ఫ్యాన్స్ మాస్ కా దాస్ కి నోటి దూల ఎక్కువైంది రోయ్ అంటూ ఫైర్ అవుతున్నారు.