డైరెక్టర్ తేజ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాలలో చాలామంది నటీనటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అలా ఒకప్పటి కమెడియన్ సుమన్ శెట్టి ని కూడా డైరెక్టర్ తేజనే జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమా మంచి విజయం అవ్వడంతో ఆయన ఇండస్ట్రీలో చాలా రోజులపాటు కమెడియన్గా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే సుమన్ శెట్టి ప్రస్తుతం సినిమాలలో నటించకుండా ఖాళీగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
సుమన్ శెట్టి స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేకపోయాయి.. ఆయన చేసే సినిమాలు వరుసగా ఫెయిల్ అవ్వడంతో కమెడియన్ గా కూడా పెద్ద క్యారెక్టర్లు దొరకలేక నెమ్మదిగా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి. అయితే సుమన్ శెట్టి మాత్రం ఇప్పటికే ఒక మంచి క్యారెక్టర్ దొరికితే నటించడానికి సిద్ధంగానే ఉన్నట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో హీరోలే కామెడీలు చేస్తూ ఉండగా పలువురు కమెడియన్లు కూడా పలు రకాల షోల వల్ల పుట్టుకొస్తూ ఉన్నారు.
కేవలం కొంతమంది కమెడియన్లు మాత్రమే పలు చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. సుమన్ శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటిలో వచ్చిన డబ్బుతో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడని డైరెక్టర్ తేజ తెలియజేశారు. ఇల్లు పూర్తి అయిన తర్వాత తన దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారని అందుకు కాళ్లు పట్టుకో పోతుంటే వద్దని చెప్పాడట. అయితే తన రుణం ఎలాగైనా తీసుకోవాలని సుమన్ శెట్టి డైరెక్టర్ తో చెప్పి బ్రతిమలాడగా..ఏదో ఒక రోజున తను అన్ని పోగొట్టుకొని రోడ్డున పడితే తనకోసం ఒక రూమ్ ఇవ్వగలరా అని సుమన్ శెట్టిని అడగగా అందుకోసం సుమన్ శెట్టి తన ఇంటిలో ఒక రూముని సిద్ధంగా ఉంచినట్లు తెలియజేశారు. ప్రతిరోజు ఆ రూముని శుభ్రం చేస్తూనే ఉంటారట సుమన్ శెట్టి.