సముద్రఖని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన టాలెంటెడ్ దర్శకుడు, విలక్షణ నటుడే కాదు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయకుడిగా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. `అల వైకుంఠపురములో` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా విడుదలైన `బ్రో` సినిమాకు ఈయనే డైరెక్టర్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉంటే.. సముద్రఖని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ పై సముద్రఖని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`అల వైకుంఠపురములో అల్లు అర్జున్ తో కలిసి నటించాను. ఆయన అందరితోనే చాలా ప్రేమగా ఉంటాడు. అందుకే అతన్ని నేను అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్పు అంటే ప్రేమ అని అర్థం. షూటింగ్ టైమ్ లో తను నాపై చూపించిన కేరింగ్ ను మాటల్లో చెప్పలేను. అల్లు అర్జున్ బంగారం లాంటి మనసున్న వ్యక్తి` అంటూ సముద్రఖని వెల్లడించాడు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. `ఆర్ఆర్ఆర్ లో మేము కలిసి నటించాను. ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం. చరణ్ నన్ను బాబాయ్ అంటాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అతన్ని సొంత కుమారుడిలా నేను భావిస్తాను` అంటూ సముద్రఖని వెల్లడించారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త ఆయా హీరోల ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.