సౌత్ స్టార్ బ్యూటీ సమంత త్వరలోనే `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ఖుషి ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాలను కూడా షురూ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని నోవాటెల్లో `ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్` నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు విజయ్, సమంత క్రేజీగా ఎంట్రీ ఇచ్చారు. డ్యాన్సులతో అదరగొట్టాడు. అయితే ఈ సందర్భంగా సమంత ఇచ్చిన స్పీచ్ హైలెట్ అయింది. ఖుషి షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే సమంత మయోసైటిస్ బారిన పడింది. దాంతో చాలా నెలలు షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ విషయంపై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. సమంత కోసం ఆరు నెలలు కాదు పదేళ్లు అయినా కూడా వెయిట్ చేసే వాళ్లమని, ఒక వేళ సమంత తిరిగి రాకపోతే శివ నిర్వాణ, తాను కలిసి విజయవాడలో సమంత పేరుతో ఇడ్లీ స్టాల్ పెట్టుకునేవాళ్లమని సరదాగా కామెంట్స్ చేశాడు.
అయితే తాజాగా జరిగిన మ్యూజికల్ కాన్సర్ట్ లో సమంత.. విజయ్ కామెంట్స్ పై సెటైర్ వేసింది. మొదట ఆమె ఖుషి నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది. అలాగే `ఆ దేవుడి దయ వల్ల విజయ్, శివ నిర్వాణలు విజయవాడలో సమంత ఇడ్లీ స్టాల్ పెట్టే పరిస్థితి రాలేదు. నేను టైంకి వచ్చి షూటింగ్ పూర్తి చేశాను. ఎందుకంటే.. ఆ ఇడ్లీ బిజినెస్ చేయగల సత్తా వారికి లేనేలేదు. కానీ ఓ బ్లాక్ బస్టర్ సినిమా తీస్తారనే నమ్మకం నాకు ఉంది.` అంటూ సమంత చెప్పుకొచ్చింది. మరియు తనను అర్థం చేసుకుని అండగా నిలబడ్డందుకు వారికి ప్రత్యేకంగా సమంత థ్యాంక్స్ చెప్పింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.