భర్తతో విడాకులు.. క్యాన్సర్ తో పోరాటం.. నటి కన్నీటి గాధ..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న మనీషా కొయిరాల క్రిమినల్, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు లాంటి ఎన్నో టాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల్లూరు నెరజాణ‌గాగా కోట్లాదిమంది గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మనీషా తాజాగా ఇటీవల బాలీవుడ్ కి రీఎంట్రీ ఇచ్చింది. ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది. నేపాల్ బ్యూటీ మనీషా కోలీవుడ్, బాలీవుడ్ లోనే కాక తెలుగులోనే ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈరోజు 53వ పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనల గురించి చూద్దాం.

మనిషా నేపాల్ కి చెందిన బిజినెస్ మ్యాన్ సామ్రాట్ ధావాల్‌ని 2010లో వివాహం చేసుకుంది. పెళైన ఆరు నెలలకే మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ దూరమయ్యారు. 2012లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే క్యాన్సర్ బారిన పడిన మనిషా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న తర్వాత క్యాన్సర్ బారి నుంచి కోలుకుంది. అయితే ఇటీవల మనిషా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లై వారి విడాకుల విషయంపై స్పందించింది.

పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నా.. ఆరేళ్లకే మాకు గొడవలు ప్రారంభమై నేను ప్రేమించిన వ్యక్తి నాకు శత్రువుగా మారాడు అంటూ ఎమోషనల్ అయింది. నేనే కాదు పెళ్లి జీవితంలో ఎవరు సంతోషంగా లేకున్నా విడిపోవడమే మంచిది అంటూ మనిషా కామెంట్ చేసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో నా ఫ్యామిలీ పరిపూర్ణమైందని లైఫ్ పార్టనర్ ఉంటే తన లైఫ్ వేరేలా ఉండేదేమో అంటూ వివరించిన మనీషా పిల్లలను పెంచడం అంటే నాకు చాలా ఇష్టమని సింగల్ మదర్ గా పిల్లలను పెంచగలన‌ని ధైర్యం వచ్చినప్పుడు తప్పకుండా ఈ విషయంపై ఆలోచన చేస్తానంటూ వివరించింది.