ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో స‌మంత ఎఫైర్‌.. చివ‌ర‌కు అత‌ని భార్య చేతుల్లో త‌న్నులు కూడా తిందా?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆ త‌ర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని స‌త్తా చాటుతోంది. స‌మంత వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. అక్కినేని నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ లో ప‌డి, అత‌నితో ఏడ‌డుగులు వేసింది. 2017లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు.

ఇక‌పోతే నాగ చైత‌న్యను మూడు ముళ్లు వేయించుకోవ‌డానికి ముందే స‌మంత హీరో సిద్ధార్థ్ తో ప్రేమాయ‌ణం న‌డిపింద‌నే టాక్ ఉంది. అయితే స‌మంత గురించి గ‌తంలో మ‌రో వార్త కూడా బాగా వైర‌ల్ అయింది. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో స‌మంత ఎఫైర్ న‌డిపింద‌ని అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌చారం జ‌రిగింది. గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `ఏ మాయ చేశావే` సినిమాతోనే స‌మంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంత‌కు ముందు ఓ రెండేళ్ల పాటు ఆయ‌న సినిమాల్లో స‌మంత చిన్న చిన్న పాత్ర‌లు పోషించింది.

ఆ రెండేళ్ల‌లోనే గౌత‌మ్ మీన‌న్ తో స‌మంత బాగా క్లోజ్ అయింద‌ట‌. ఆ త‌ర్వాతే గౌత‌మ్ మీన‌న్ స‌మంత‌ను హీరోయిన్ గా చేశార‌ట‌. ఏ మాయ చేశావే సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. స‌మంత‌తో గౌత‌మ్ మీన‌న్ మ‌రో సినిమా చేశాడు. అదే ఏటో వెళ్ళిపోయింది మనసు. ఇది ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇదిలా ఉండ‌గా.. గౌత‌మ్ మీన‌న్, స‌మంత చాలా స‌న్నిహిత్యంగా ఉండేవార‌ట‌. అయితే వీరిద్ద‌రూ ఓ హోట‌ల్ రూమ్ లో ఉండ‌గా.. గౌత‌మ్ మీన‌న్ భార్య విష‌యం తెలుసుకుని అక్క‌డ‌కు వెళ్లింద‌ట‌. భ‌ర్త‌తో స‌మంత‌ను చూసి అక్క‌డే ఆమెను చిత‌క‌బాదేసింద‌ట‌. గౌత‌మ్ మీన‌న్ భార్య చేతుల్లో త‌న్నులు తిన్న స‌మంత‌.. అవ‌మానంగా భావించి చెన్నై నుంచి హైద‌రాబాద్ కు మ‌కాం మార్చేసింద‌ని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు.