బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్.. మరోవైపు బులితెర పాపులర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేతగా గెలుపొందాడు.
అయితే ఫినాలే ఎపిసోడ్ లో ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని అభినందిస్తూ.. సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. హౌస్ నీలాగా క్లీన్ గా ఎవరూ ఉంచలేరు.. టాయిలెట్స్ కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా కడిగావంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే గతంలో తానూ టాయిలెట్స్ కడిగానంటూ షాకింగ్ ఫ్యాక్ట్స్ ను బయటపెట్టారు.
నేను చదువుకునేటప్పుడు బోర్డింగ్ స్కూల్ లో టాయిలెట్స్ శుభ్రం చేశాను. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా టాయిలెట్స్ క్లీన్ చేశాను. మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు. ఏ పని తక్కువ కాదు అంటూ సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సల్మాన్ ఖాన్ అతటివాడు టాయిలెట్స్ క్లీన్ చేయడం ఒక ఎత్తైతే.. ఆ విషయాన్ని ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెట్టడం మరొక ఎత్తు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ సిప్లిసిటీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొంత కాలం జైల్లో గడిపారన్న సంగతి తెలిసిందే.