టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చేసిన హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్.. ఇక్కడ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితోనూ జతకట్టింది. అలాగే కోలీవుడ్ లో సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది. ఆపై బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.
గత ఏడాది రకుల్ నుండి దాదాపు అర డజన్ సినిమాలు వచ్చాయి. కానీ, అవేమి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినాసరే రకుల్ బాలీవుడ్ ను విడిచిపెట్టడం లేదు. సౌత్ లో ఆఫర్లు వస్తున్నా సరే పట్టించుకోకుండా.. నార్త్ లోనే సెటల్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇకపోతే తాజాగా రకుల్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఇప్పటికే రకుల్ గ్యారేజ్ లో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును కొనుగోలు చేసింది.
కొత్త కారులో రకుల్ చక్కర్లు కొడుతున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ రకుల్ కొత్త కారు రేటెంతో తెలుసా.. రూ.3.40 కోట్లు. ఈ విషయం తెలిసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. అనేక ఫీచర్లతో అత్యంత లగ్జరీగా ఈ కారు ఉంటుంది. చాలా మంది సెలబ్రెటీల వద్ద ఈ కారు ఉంది. ఈ లిస్ట్ లో ఇప్పుడు రకుల్ కూడా చేరింది. కాగా, రకుల్ గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే వీరు కన్ఫార్మ్ చేశారు. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదని అంటున్నారు.
View this post on Instagram