బస్సు డిపోకి వెళ్లిన రజనీకాంత్.. ఆ సంగతి తెలిసి ఆశ్చర్యపోయిన ఉద్యోగులు..

ప్రముఖ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే రజినీకాంత్ కి వందల కోట్ల సంపాదన, వేల కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడు . ఖాళీ సమయంలో ఆయన ఆశ్రమాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తుంటాడు . నేలపై పడుకుంటాడు,  ఆర్డినరీ భోజనం చేస్తారు. రజినీకాంత్ కి ఉన్న మరో గొప్ప గుణం ఏంటంటే ఆయన తన మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. రజినీకాంత్ జీవితం బెంగుళూరులో బస్ కండక్టర్ గా మొదలైంది. ఆ సమయంలో ఆయనకు తోడుగా ఉండి, ప్రోత్సహించిన మిత్రులను ఇప్పటికీ ఆయన వదల్లేదు.

తాజాగా రజినీకాంత్ సింప్లిసిటీ ని గుర్తుచేసే సంఘటన మరొకటి జరిగింది. రజినీకాంత్ హీరో కాక ముందు బస్ కండక్టర్ గా పనిచేసిన బస్ డిపోను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. బెంగుళూరులోని జయనగర్ బిఎంటీసీ బస్ డిపోలో ఆయన సందడి చేశారు. రజినీకాంత్ వస్తున్నారు అనే సమాచారం డిపో లో ఎవరికి తెలియకపోవడం తో సడన్ గా అక్కడ ఉన్నా ఉద్యోగులు అందరూ రజినీ ని చూసి ఆశ్చర్య పొయ్యారు. రజినీకాంత్ తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఒకప్పుడు ఆయన పని చేసిన ప్రదేశాన్ని అంతా తిరిగి అప్పటి జ్ఞాపకాల ను రజినీకాంత్ నెమరు వేసుకున్నారు. జయనగర్ బిఎంటీసీ ఉద్యోగులతో రజినీకాంత్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తాజాగా రజినీకాంత్ నటించిన మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మూడు వారాలుగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న జైలర్ రూ. 600 కోట్ల మార్క్ చేరుకుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. చాలా గ్యాప్ తర్వాత రజినీకాంత్ తన రేంజ్ హిట్ కొట్టాడు. కోలీవుడ్ లో ఎప్పటికీ తానే నెంబర్ వన్ అని నిరూపించాడు. జైలర్ మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేయగా తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు.