రీ రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చి.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..!!

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండు నడుస్తుంది. నిత్యం ఏదో సినిమా రీ రిలీజ్ అవుతూ థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది. స్టార్ హీరోల చిత్రాలు, ఇంతకుముందు రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవి కూడా రీ రిలీజ్‌లో భారీ కలెక్షన్లు సంపాదించి రికార్డ్ సృష్టిస్తున్నాయి.

దీంతో ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో సినిమాలు మళ్లీ మళ్లీ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్లో కొత్త సినిమాల కంటే ఇంతకుముందు రీరిలీజ్ అవుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన బిజినెస్ మ్యాన్, సింహాద్రి, ఖుషి, నెంబర్ 1, పోకిరి, జల్సా, బిల్లా , ఒక్కడు, ఆరెంజ్, దేశముదురు, సూర్య స‌నాఫ్‌ కృష్ణ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకులను మెప్పించాయి.

అయితే అసలు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఏ హీరో సినిమాతో మొదలైందో తెలిసి ఈ హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొట్టమొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి ఆగస్టు 9వ తేదీన 2022లో ఈ సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా రీ రిలీజ్ కు చాలా సినిమాలే లిస్ట్‌లోకి చేరాయి.