సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ ఎనర్జిటిక్ గా ఉంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. తాజాగా జైలర్ మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే జైలర్ విడుదలకు ముందు రోజు రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారని అందరికీ తెలుసు.
అయితే కరోనా వల్ల గత నాలుగు ఏళ్లు హిమాలయాలకు దూరంగా ఉన్న రజినీ.. తన తాజా సినిమా జైలర్ రిలీజ్ కు ముందు హిమాలయాలకు వెళ్లారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున బౌన్సర్లు ఉంటారు. కానీ, రజనీకాంత్ మాత్రం హిమాలయాలకు వెళ్లేటప్పుడు ఒక్కరే వెళ్తారు. రజనీ ఎంత సింపుల్ గా ఉంటారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
ఇక హిమాలయాల్లో రజనీకాంత్కు చాలా మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారట. వారందరిని కలిసిన తర్వాతే ఆయన ఇంటికి తిరిగి వెళ్లారట. ఇక హిమాలయాల్లో సన్యాసులను కలిసి పూజలు చేస్తారని, వారు ఇచ్చే వేర్లు, తాయత్తుల కారణంగానే ఆయన ఇంత ఎనర్జిటిక్ గా ఉంటారని రజనీ ఫ్రెండ్ రాజ్ బహదూర్ వెల్లడించారు. రజనీకాంత్ ఎనర్జీ సీక్రెట్ అంతా హిమాలయాల్లోనే ఉందని.. అక్కడి సన్యాసులు ఇచ్చే వేర్లు ఆయన తింటారని, నిత్యం అక్కడ ధ్యానం చేస్తాడని రాజ్ బహదూర్ పేర్కొన్నారు.