ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే సౌత్ లో స్టార్డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ల జాబితాలో నిత్యా మీనన్ ఒకటి. బెంగుళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించిన నిత్యా మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. అద్భుతమైన నటిగానే కాకుండా మంచి సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది.
సౌత్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్స్ జాబితాలో నిత్య మీనన్ ఒకటి. అయితే కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అయిన నిత్యా మీనన్.. 35 ఏళ్లు వచ్చినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. గతంలో ఈ బ్యూటీ ఓ టాలీవుడ్ హీరోను ప్రాణంగా ప్రేమించింది అన్న టాక్ ఉంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నితిన్. వీరిద్దరూ జంటగా `ఇష్క్` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
ఈ సినిమా సూడపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే చిత్రంలో జంటగా నటించారు. అయితే ఈ రెండు సినిమాల ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట. కానీ, వీరి పెళ్లికి నితిన్ సోదరి నికితా రెడ్డి అడ్డుపడింది. హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే.. మ్యారేజ్ లైఫ్ సక్రమంగా సాగదంటూ నితిన్ కు ఫుల్ గా బ్రెయిన్ వాష్ చేసిందట. దాంతో అప్పటి నుంచి నితిన్ నిత్యా మీనన్ దూరంగా ఉన్నాడట. అలా పెళ్లి వరకు వెళ్లకుండానే నితిన్, నిత్యా మీనన్ విడిపోయారని గతంలో ప్రచారం జరిగింది. మరి ఇది ఎంత వరకు నిజమో వారికే తెలియాలి.